Posts

Showing posts from May, 2017

శివాలయ దర్శన విధానం

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్లే అని చెప్పబడింది. శివా...

అరుణాచలేశ్వరుడు

Image
మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,  సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.  కంచిలో పృథివీ లింగం,  జంబుకేశ్వరంలో జలలింగం,  అరుణాచలంలో అగ్నిలింగం,  చిదంబరంలో ఆకాశలింగం,  శ్రీకాళహస్తిలో వాయులింగం,  కోణార్కలో సూర్యలింగం,  సీతగుండంలో చంద్రలింగం,  ఖాట్మండులో యాజమాన లింగం –  ఈ ఎనిమిది అష్టమూర్తులు.  ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.  కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.  అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.  అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవే...

అయ్యో! నేనే!

ఉదయం 6 గంటల సమయం.......ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ......లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి...... " ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? " ఒక్క నిమిషం ఆలోచించాను. నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు..... కాఫీ కావాలి నాకు........నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు. ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు? వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు.......ఇంటి బయట చాలా మంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు...... అయ్యో! అది నేనే! దేవుడా! నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు.....బిగ్గరగా పిలిచాను........నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి నా పక్కగదిలోకి తొంగి చూశాను.... నా భార్య విపరీతంగా ఏడుస్తోంది. కొడుకును పట్టుకుని.......భార్యను పిలిచాను........తనకు నా మాటలు వినిపించలేదు........మరో గదిలోకి వెళ్ళి చూశాను...... ఆ గదిలో మా అమ్మ ...నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు దు;ఖంలో....... ...

నిప్పుల కత్తెరలు

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు.అంటే ...

నామార్ధాలు

అనసూయ - అసూయ లేనిది అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఆ...

అక్షయ తృతీయ

వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవత...