గిరిజమ్మ కరుణించింది

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!! గత 6-7 నెలలుగా ఈ పిలుపు కోసం ఎదురు చూపు. ఇన్నాళ్ళకు సాకారమైనదీ కల. గిరిజాదేవి (బిరజాదేవి) దయతలిచింది, కన్నులపండుగగా అద్భుతమైన దర్శనంతో తనువు, మనసు పులకరించాయి. గుడి 1-3pm మూసివేస్తారంట. అందుకని, 2-3 గంటలు కోవెల ఆవరణలోనే గడిపే అదృష్టం కూడా దక్కింది. శక్తిపీఠంలో అలా ఉండగలగడంకూడా వరమేకదా!!! ఆలయ ప్రాంగణంలో చాలా శివలింగాలు ఉన్నాయి. 10-15 సహస్రలింగాలు కూడా ఉన్నాయి. చూసి తీరాల్సిన ఈ అద్భుతాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం సుమా !!! ఇంకొక విశేషమేమిటంటే, ఇది నాభిగయ క్షేత్రం. గయ, జాజ్ పూర్, పిఠాపురం - ఈ మూడు క్షేత్రాలు కలిపి గయ క్షేత్రాలు. Places visited: నాభి గయ క్షేత్రం - జాజ్ పూర్ - 1:30PM గిరిజా దేవి శక్తి పీఠం - జాజ్ పూర్ - 3PM