చావు
*ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు.*
చనిపోయిన మనిషికీ-భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.
*దేవుడు* మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.
*మనిషి:*అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
*దేవుడు:*తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.
*మనిషి* నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను
*దేవుడు:* నీకు చెందినవి ఉన్నాయి
*మనిషి:* నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
*దేవుడు:* అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి
*మనిషి:* పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
*దేవుడు:* కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
*మనిషి* అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
*దేవుడు:* అవి పరిస్థితులవి నీవి కావు
*మనిషి:* నా స్నేహితులున్నారా అందులో?
*దేవుడు:* వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
*మనిషి:* హూం..నా భార్య, బిడ్డలునా?
*దేవుడు:* వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
*మనిషి:* అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
*దేవుడు:* తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో కలిసి పోతుంది
*మనిషి:* స్వామీ అయితే నా ఆత్మా?
*దేవుడు:* ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
*మనిషి:* ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ,మానవ సేవను మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
*మనిషి:*స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?
*దేవుడు:* ఉంది. నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే. ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
***************************************
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. *పశ్చాతాపులను క్షమించాలి* *తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి* మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
Comments
Post a Comment