నాలుగు యుగాలు
వేదాల ననుసరించి యుగాలు నాలుగు :
అవి :
1) సత్యయుగము
2) త్రేతాయుగము
3) ద్వాపరయుగము
4) కలియుగము.
అవి :
1) సత్యయుగము
2) త్రేతాయుగము
3) ద్వాపరయుగము
4) కలియుగము.
1) సత్యయుగము : నాలుగు యుగాలలో సత్య యుగము మొదటిది. ఈ సత్యయుగానికే కృతయుగమని పేరు. ఈ యుగమునందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.
ఈ యుగము వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.
ఈ యుగము వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.
2) #త్రేతాయుగము :- రెండవ యుగము త్రేతా యుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది. ఈ యుగము వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది.
3) #ద్వాపరయుగము :- మూడవు యుగమే ద్వాపర యుగము అని అంటారు, ఈ యుగమున భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించారు. దీని కాల పరిమాణము 432000 * 2 = 864000అనగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది.
4) #కలియుగము :- కలి యుగము యొక్క కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరములు గడిచిపోయినాయి. హిందూ మరియు బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంత ప్రకారము పూర్వ శఖము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని భావిస్తారు. కలియుగాంతము నందు కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు.
Excellent information
ReplyDelete9059985684
ReplyDeleteDrloans1.blogspot.com
ReplyDeletethank you very much
ReplyDeleteUseful and easy to understand
ReplyDeleteధన్యవాదాలు 🙏
ReplyDeleteదీనివల్ల చాలామంది కళ్ళు తెరుచుకుంటాయి.