శ్రీశైల మహాక్షేత్రం
#శ్రీశైల _చరిత్ర
శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, ఆత్మకూరు తాలుకా లోనున్న నల్లమల అడవులలోని పర్వత శ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణా నదికి కుడివైపున ఉంది. ఈ క్షేత్రం సముద్రమట్టానికి 476 మీటర్లు సుమారుగా 1500 అడుగులు .
#శ్రీశైల_మహిమ
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి కి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబికాదేవికి, నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై , 8 శృంగాంగాలతో, 44 నదులతో దీర్ఘ తీర్థరాజాలతో, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్ర గుండ, సూర్య గండాది పుష్కరిణులతో స్పర్శవేదులయిన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఔషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
#క్షేత్ర_ప్రాముఖ్యం.
సకల లోకారాధ్యం అయిన శ్రీశైల మహాక్షేత్రం, భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైలాన్ని స్మరిస్తూ _ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైల ఉత్తదిగ్భాగే అని, తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పంలో చెప్పుకుంటారు.
అక్షయ వరాలనిచ్చే దక్షాద్వర హరుడు తనను చూడవచ్చే లక్షలాది భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ కొలువు తీరి ఉన్న ఈ దక్షిణ కైలాసం ప్రతి భక్తుని మనస్సును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉత్సవ సమయాలలో మినహా సాధారణ రోజులలో కుల, మత, లింగ వివక్షత లేకుండా కి స్వామికి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకొనే అవకాశం ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి మనం స్వయంగా అభిషేకించ వచ్చు. కాని అందుకు అవసరమైన రుసుము చెల్లించి టికెట్ తీసుకోవాలి పూజా ద్రవ్యాలను భక్తులే తెచ్చుకోవాలి
బ్రహ్మగిరి, విష్ణు గిరి గ,భద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన మువ్వల సవ్వడులతో వేదఘోషలు గుర్తుకుతెచ్చే పావన కృష్ణవేణీ నదీ, పాతాళగంగ అనే పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను సంతరించి పెడుతుంది.
18 పురాణాల లోనే కాక భారత రామాయణాల్లోనూ సంస్కృతాంధ్ర తమిళ, కన్నడ,, మరాఠీ గ్రంథాలలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం లోని " శ్రీ శైల ఖండము"పూర్తిగా వివరిస్తోంది .
ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన శ్రీ శంకరభగవత్పాదులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి "శివానందలహరి" అనే గ్రంథాన్ని వ్రాసినట్లు చెప్పబడుతోంది
శ్రీ శంకరభగవత్పాదులు "యోాగ తారావళి" అనే గ్రంథంలో "సిద్ధం తథావిధ మనోవిలయాం సమాధౌ శ్రీశైల శృంగకుహరేషు కదోపలప్స్యే" అంటూ శ్రీశైల పర్వత కుహరాల్లోనే సిద్ధిని పొందాలని కోరుకోవటం ఈ క్షేత్రం యొక్క గొప్పదనాన్కి మరో తార్కాణం.
శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, ఆత్మకూరు తాలుకా లోనున్న నల్లమల అడవులలోని పర్వత శ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణా నదికి కుడివైపున ఉంది. ఈ క్షేత్రం సముద్రమట్టానికి 476 మీటర్లు సుమారుగా 1500 అడుగులు .
#శ్రీశైల_మహిమ
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి కి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబికాదేవికి, నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై , 8 శృంగాంగాలతో, 44 నదులతో దీర్ఘ తీర్థరాజాలతో, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్ర గుండ, సూర్య గండాది పుష్కరిణులతో స్పర్శవేదులయిన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఔషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
#క్షేత్ర_ప్రాముఖ్యం.
సకల లోకారాధ్యం అయిన శ్రీశైల మహాక్షేత్రం, భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైలాన్ని స్మరిస్తూ _ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైల ఉత్తదిగ్భాగే అని, తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పంలో చెప్పుకుంటారు.
అక్షయ వరాలనిచ్చే దక్షాద్వర హరుడు తనను చూడవచ్చే లక్షలాది భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ కొలువు తీరి ఉన్న ఈ దక్షిణ కైలాసం ప్రతి భక్తుని మనస్సును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉత్సవ సమయాలలో మినహా సాధారణ రోజులలో కుల, మత, లింగ వివక్షత లేకుండా కి స్వామికి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకొనే అవకాశం ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి మనం స్వయంగా అభిషేకించ వచ్చు. కాని అందుకు అవసరమైన రుసుము చెల్లించి టికెట్ తీసుకోవాలి పూజా ద్రవ్యాలను భక్తులే తెచ్చుకోవాలి
బ్రహ్మగిరి, విష్ణు గిరి గ,భద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన మువ్వల సవ్వడులతో వేదఘోషలు గుర్తుకుతెచ్చే పావన కృష్ణవేణీ నదీ, పాతాళగంగ అనే పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను సంతరించి పెడుతుంది.
18 పురాణాల లోనే కాక భారత రామాయణాల్లోనూ సంస్కృతాంధ్ర తమిళ, కన్నడ,, మరాఠీ గ్రంథాలలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం లోని " శ్రీ శైల ఖండము"పూర్తిగా వివరిస్తోంది .
ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన శ్రీ శంకరభగవత్పాదులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి "శివానందలహరి" అనే గ్రంథాన్ని వ్రాసినట్లు చెప్పబడుతోంది
శ్రీ శంకరభగవత్పాదులు "యోాగ తారావళి" అనే గ్రంథంలో "సిద్ధం తథావిధ మనోవిలయాం సమాధౌ శ్రీశైల శృంగకుహరేషు కదోపలప్స్యే" అంటూ శ్రీశైల పర్వత కుహరాల్లోనే సిద్ధిని పొందాలని కోరుకోవటం ఈ క్షేత్రం యొక్క గొప్పదనాన్కి మరో తార్కాణం.
Comments
Post a Comment