Posts

Showing posts from October, 2018

గొరవనహళ్ళి లక్ష్మీదేవి

Image
భక్తి టీవీ లో పుణ్యక్షేత్రం కార్యక్రమంలో చూసిన ఒక గొప్ప క్షేత్రం, గొరవనహళ్ళి లక్ష్మీదేవి ఆలయం.  చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అనుకుంటూనే ఉన్నాం.  ఇన్నాళ్టికి మాకు ఆ అవకాశం దొరికింది. ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి, ముందుగా ముక్తినాథేశ్వర స్వామి దగ్గరకి చేరుకున్నాం.  సరిగ్గా, స్వామికి నమక చమకాలతో అభిషేకం చేస్తూ ఉండగా వెళ్లి, కళ్లారా ఆ తంతు అంతా పరికించి ఆనందించాం.  పురాతన ఆలయం, కొత్త సొబగులతో అందంగా ఉంది.  స్వామి ఇంకా మమ్మల్ని చూస్తున్నట్టే ఉంది.  అక్కడ నుంచి బయలుదేరి, పక్కనే ఉన్న విఠల ఆలయం లో కూడా అభిషేకం చూసాం.  త్రోవలో ఉన్న రామ మందిరం చూసి, అక్కడ నుంచి భోగ నరసింహ స్వామి క్షేత్రానికి చేరుకున్నాం.  స్వామి వైభవం అంతా ఇంతా కాదు, వర్ణించనలవి కాదు.  ఆ తరువాత కొండ మీద వెలసిన యోగ నరసింహ స్వామి క్షేత్రానికి వెళ్లాం.  600 మెట్లు ఎక్కి అందమైన ప్రకృతిలో అందంగా అలరారుతున్న అయ్యవారిని, దేవేరిని చూసి మురిసిపోయాం. అక్కడినుంచి సరాసరి లచ్చమ్మ దగ్గరకి ప్రయాణం.  అమ్మవారు స్వయంగా విలసిన ఈ క్షేత్ర వైభవం అనన్య సామాన్యం....

కదిరి - లేపాక్షి

Image
బెంగుళూరు నుంచి దగ్గరలో ఉన్న అద్భుత క్షేత్రాలలో ఒకటైన "శ్రీమత్ ఖాద్రి నరసింహ స్వామి" దగ్గరకి ఇన్నాళ్లకు పిలుపు వచ్చింది.   గూగుల్ సహాయంతో - త్రోవలో ఉన్న ఇంకొన్ని క్షేత్రాల దర్శనాలు చేసుకుంటూ రెండు రోజులని ఆనందంగా గడిపేసాం. ఎంతో విలువైన జ్ఞాపకాలతో తిరిగివచ్చాం. అసలు ఆరంభమే అద్భుతం - వేణుగోపాల స్వామికి జరిగిన అభిషేకాలు, సేవలు - కనుల విందుగా చూసాం.  నంది హిల్స్ పైన ఉన్న యోగ నందీశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది.  రమణీయమైన ప్రకృతిని చాలాసేపు  ఆస్వాదించి, కొండదిగి భోగ నందీశ్వరాలయానికి చేరుకున్నాం.  మాటలకందని అనుభూతితో అక్కడ నుంచి  రంగనాథ స్వామిని చూడటానికి వెళ్లాం.  తలుపులు వేసి ఉన్నాయని అనుకుంటూ ఉండగానే, "వెళ్లి, తలుపులు తీసుకొని దర్శనం చేసుకోండి" అన్న మాటలు వినబడ్డాయి.  ఇంకేం కావాలి ?  మనసు పరవశంతో పరవళ్లు తొక్కింది. చక్కగా స్వామి సన్నిధి లో కాసేపు గడిపి వచ్చాం.  తరువాత జాలరి నరసింహ స్వామి, స్వయం వ్యక్తమై వేంచేసిన క్షేత్రాన్ని దర్శించి  కదిరి చేరుకున్నాం.  శ్రీమత్ ఖాద్రి నారసింహ స్వామి వారి దర్శనం...

దసరా నవరాత్రులు

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  ప్రతి ప్రాణిలోనూ ఆ జగన్మాత ఇచ్ఛాశక్తిగా, భౌతిక శక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా లోపల దాగి ఉంటుంది. ఆ కారణంగానే ప్రతిప్రాణీ తన బుద్ధితో ఓ పనిని చేయాలని సంకల్పించి, దానికి తన భౌతిక శక్తిని వినియోగించి, జ్ఞానశక్తిగా మార్చుకుంటుంది. ఆ జ్ఞానశక్తినే క్రియాశక్తి రూపంలో ఆచరించగలుగుతున్నది. సృష్టిలోని సకలచరాచరాల్లో శక్తి రూపంలో దాగి ఉన్న ఆ తల్లికి వేలవేల నమస్కారాలు. సృష్టిలోని సకల జీవులు ఆ అమ్మనే ఆశ్రయిస్తాయి. కనుకనే ఆమె అమ్మలగన్న అమ్మ అయింది. శ్రీదేవి లీలా విగ్రహ స్వరూప మహాత్మ్యం అనిర్వచనీయం. వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఆదిపరాశక్తి.. అమ్మలగన్న అమ్మ.. శరణన్న వారిని రక్షించి అభయమిచ్చే లోకపావని ఆ జగన్మాత. లోకకల్యాణార్థం రాక్షస సంహారం గావించింది. ఒక్కొక్క రోజు ఒక్కో రూపం ధరించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది రాక్షసు లను సంహరించింది. ఆమె సాధించిన విజయా నికి గుర్తుగా తొమ్మిది రోజులపాటు నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. శర దృతువులో వస్తాయి కాబట్టి వీటిని శరన్నవ రాత్రులు అంటారు. ఈ దేవీ నవరాత్రులు అమ్మ వ...