Posts

Showing posts from November, 2018

రంగనాథ దర్శనం

Image
ఎంత వెతికితే చాలు అనిపిస్తుంది, అంతా నిండిన భగవంతుడిని ?  బెంగళూరు కి ఇంత దగ్గరలో, ఇన్ని క్షేత్రాలలో రంగనాథ స్వామి వెలిశారు అని తెలిసి ఆశ్చర్యం, ఆనందం !!! కార్తీకంలో, ఇంకొక మరపురాని వారాంతం.  కళ్ళ విందుగా, మనసు నిండుగా, దర్శనాలు పొందిన ఈ జన్మ ధన్యం. ఎన్నో స్వయం వ్యక్త క్షేత్రాలు, సాలగ్రామ రూపంతో రంగనాథుడు లక్ష్మీసమేతుడై వేంచేసి ఉన్న మహాద్భుత ప్రదేశాలు !!! మాండవ్య మహా ముని, వసిష్ఠుడు వంటి ఎందరో మహానుభావులు కొలిచిన మూర్తులు మనం చూడగలగడం, ఎంతటి అదృష్టమో కదా !!!  ఇంతకన్నా ఇంకేమి కావాలి, నిన్ను ఇంకేమి అడగాలి !!! అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే !!! Places visited: 25th Nov Sri Ranganatha Swamy Temple, Magadi  - 8AM Sri Someshwara Temple, Aladakattepalya  - 10AM Lakshmi Narasimha Temple - Devarahatti - 11AM Sri Ranganathaswamy Temple, Doddamudigere  - 12 noon Sri Guddada Ranganatha Swamy Temple, A. Hosahalli  - 1 PM Sri Shaneshchara Punyakshetra, Dombarahatti  - 2 PM Bettada Ranganathaswamy T...

పంచారామాలు - అష్టసోమేశ్వరాలు

Image
మా అమ్మ-నాన్న చాలా ఏళ్లుగా చూసిన ఎదురుచూపులు, ఈ ఏడాది ఫలించాయి.  పంచారామాలు ఒకే రోజు చూడాలన్న వాళ్ళ కోరిక ఆ భగవంతుడు ఇన్నాళ్లకు తీర్చాడు. ఉదయాన్నే గుంటూరు నుంచి అమరావతి చేరుకున్న మాకు, మైకు లో "అభిషేకం మొదలవుతోంది, అభిషేక దర్శనం చూడాలనుకునే భక్తులు తొందరగా రండి" అంటూ వినబడింది.  అమరేశ్వర స్వామికి (ఇంద్ర ప్రతిష్ఠితం) నమక చమకాలతో అభిషేకం చేస్తూ ఉంటే, గుడ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాం.  ఎంత బాగుందో, కళ్ళకి ఎంత సంబరమో. అమరావతి ఉంచి భీమవరం చేరుకున్న మాకు, సోమేశ్వర స్వామి (చంద్ర ప్రతిష్ఠితం) చక్కటి దర్శనం ఇచ్చారు.  ఎందుకో తెలియదుగానీ, ఎక్కువ భక్తులు లేరు.  మాకు స్వామి సన్నిధి లో ఎక్కువసేపు ఉండే అవకాశం దక్కింది.  అక్కడినుంచి పాలకొల్లు వెళ్లాం, క్షీరా రామలింగేశ్వర స్వామిని (విష్ణు ప్రతిష్ఠితం) చక్కగా దర్శించుకున్నాం. కొప్పు రామలింగేశ్వరుని కొప్పు చక్కగా కనబడింది సుమా.  తరువాత మజిలీ, సామర్లకోట.  చాళుక్య కుమారా రామ భీమేశ్వర స్వామిని (కుమారస్వామి ప్రతిష్ఠితం) చూసి తరించాం.  చివరగా దక్షారామం వెళ్లిన మాకు భీమేశ్వర స్వామి...

పంచభూత శివాలయాలు

Image
కార్తీకం మొదలవుతూనే శివయ్యని దర్శించుకోవాలని కొన్ని నెలలుగా వేచి ఉన్నాం.  దీపావళి అవుతూనే, అర్ధరాత్రి లేచి రైలు ఎక్కేసాం.  తిరుచిరాపల్లి లో దిగి, జంబుకేశ్వర స్వామి (జల లింగం) దర్శనం చేసుకొని  పంచ భూత శివాలయాల యాత్రకు ఆరంభం చేసాం. అక్కడినుంచి శ్రీరంగంలో రంగనాథ స్వామి విరాట్ రూపాన్ని కళ్లారా దర్శించి, సాయంత్రం పుండరీకాక్షుని సన్నిధికి వెళ్లాం. అద్భుతమైన ఆలయాన్ని, అయ్యవారి అందాన్ని చూస్తూ పరవశించిపోయాం.  రాత్రి మళ్ళీ జంబుకేశ్వర స్వామి సన్నిధిలో గడిపి, శ్రీరంగంలోనే బస చేసాం. తెల్లారి లేస్తూనే, చిదంబరానికి బయలుదేరాం.  త్రోవలో వైద్యనాధేశ్వరుని దర్శించుకొని, నటరాజ సన్నిధికి (ఆకాశ లింగం) చేరుకున్నాం.  అక్కడే చాలాసేపు అయ్యోరిని, అమ్మోరిని చూస్తూ గడిపేసాం.  అక్కడ పార్వతీదేవి పేరు ఏంటో తెలుసా, శివకామసుందరి - ఎంత అందమైన పేరు !!! ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక దివ్యదేశం కూడా ఉంది.  విష్ణుమూర్తి కూడా చక్కని దర్శనం ప్రసాదించారు. సాయంత్రానికి అరుణాచలం చేరుకున్నాం.  అరుణాచలేశ్వరుని (అగ్ని లింగం) దర్శనం పూర్వజన్మ పుణ్య ఫలం.  మానవ జీవితం "అరుణాచల దర్శనాని...