Posts

Showing posts from September, 2024

జీవన కాలమ్

*గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట.*  *అప్పారావు గారు వైద్యుడిని చూసి.. ‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట.*  *వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు.* *మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని చెప్పారు.* *ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ‘ఏం కావా’లని.*  *’ఓ పెగ్గు స్కాచ్ కావాల’న్నారట ఆమె.*  *ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని, చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని.* *చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - ‘ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు.* *మృత్యువుని మజిలీగా, గుర్తు పట్టడం గొప్ప సంస్కారం.* *మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత.* *భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ, ఒక ఆలోచనకు మనల్ని తర్ఫీదు చేస్తుంది - ...

ధర్మమే గెలుస్తుంది

*_అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని..._* *_అది తప్పు...! ధర్మం దానంతట అదే గెలవదు..!_* *_నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..!_* *_అర్థం కాలేదా...?_* *_ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడు..!_* *_కృత యుగం లో…_* *_తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు. అని చెప్పడం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం, అణువు అణువు లో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో  ఒక స్తంభం నుండీ వచ్చాడు._* *_హిరణ్య కశ్యపుడిని సంహరించాడు._* *_ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి, కష్టాలు పడుతూ ఉంటాడు._* *_త్రేతాయుగంలో…_* *_రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,_* *_సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని…  రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు._* *_రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు._* *_ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు._* *_ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి._*...

కర్మ ఫలం

కర్మ ఫలం..తప్పదు ఎవరికైనా అనుభవించక..! మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది..! కర్మ బలీయమైనది..! రాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.  కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు - మంత్రవేత్త రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు  ఇంకోకవైపు నుంచి - దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. తక్షకుడు కూడా బ్రహ్మణవేషధారియై, కశ్యపుని చూసి "మహామహితాత్మా! తమరెవరు?  ఎచ్చటికీ పయనం?" అని అడిగాడు. "ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే,  నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను" అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు. "అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో - బురద పామో అనుకుంటున్నావా?  సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు - తక్షకుడే స్వయంగా అయితేనో?"  "తక్షకుడైనా కానిమ్ము!  అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము!  నా దగ్గర ఉన్నదిగారడీ వాడి పాము మంత్రమో -  విషకీటక మంత్రమో అనుకుంటున్నావా?"  అని ప్రశ్నించాడు కశ్యపుడు. అంతగొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని" అని నిజరూపం చూపి...

పూజ ఎందుకు చేయాలి?

పై ప్రశ్న చిన్న పిల్లలు అడిగారు అంటే అర్ధం ఉంది, కానీ నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా, ప్రపంచ వ్యామోహము లో మునిగి, అరిషడ్వర్గాలలో తేలుతూ కూడా, ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మనము వెంటనే, పూజ చేయక పోతే, కళ్ళు పోతాయి లేదా సంపదలు పోతాయి, లేదా చేస్తే సంపదలు వస్తాయి అంటాం. ఎందుకంటే, మనకు కూడా, పూర్తి అవగాహన ఉండదు, పూజ ఎందుకు అని.  మనము పెట్టే ప్రసాదము దేవుడు ఆరగిస్తున్నారా? ఆరగిస్తే, ఇక నైవద్యం పెడతామా, ఆయన కడుపు నిండాలంటే, ఎన్ని గుండిగల ప్రసాదం పెట్టాలి, తిరుపతి వెంకన్న దగ్గర పెట్టిన విధముగా? అందుకే ఆయన తేలికగా తెలివిగా, బీదవారు కూడా పెట్టగలిగే విధముగా, కాణీ ఖర్చు లేకుండా, మన మనసు నైవేద్యంగా పెట్టాలి అని ఎప్పుడో చెప్పారు.  దేవుడు నిరాకారుడు నిరంజనుడు. ఈ ప్రపంచమంతా వ్యాపించినవాడు నడిపిస్తున్నవాడు. నీలో నాలో ఉన్నాడు చైతన్యములా. ఆ చైతన్యము పోతే, మనిషి శవము తో సమానము. కాకపోతే, అది అర్ధం కావడానికి ఆచరణలో సాధన చేడానికి, మనసు నిలవాలి సహకరించాలి. దానికే పూజ మొదటి మెట్టు, మన కోసం. కొడుకు ఉన్నాడా ఇంట్లో !!!.. ఉన్నాడు... చాలు ... పెద్ద ఊరట. ‘‘జాతస్య  హి ధ్రువో మృత్యుః  ధ్రువం  జన్...