ధర్మమే గెలుస్తుంది

*_అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని..._*

*_అది తప్పు...! ధర్మం దానంతట అదే గెలవదు..!_*

*_నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..!_*

*_అర్థం కాలేదా...?_*

*_ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడు..!_*

*_కృత యుగం లో…_*

*_తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు. అని చెప్పడం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం, అణువు అణువు లో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో  ఒక స్తంభం నుండీ వచ్చాడు._*

*_హిరణ్య కశ్యపుడిని సంహరించాడు._*

*_ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి, కష్టాలు పడుతూ ఉంటాడు._*

*_త్రేతాయుగంలో…_*

*_రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,_*

*_సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని…  రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు._*

*_రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు._*

*_ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు._*

*_ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి._*

*_నరాలు తెగి రక్తం చిందుతున్నాసరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు. యుద్ధంలో గెలిచాడు... ధర్మం గెలిచింది..!_*

*_రావణుడు సంవరించబడ్డాడు._*

*_ద్వాపరయగంలో…_*

*_కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్దాన్ని చూడలేదు.._*

*_ధర్మం చూసుకున్నాడు,  పాండవుల పక్షాన నిలుచున్నాడు, అర్జునుడికి రధ సారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, అబద్ధం ఆడాడు, చివరకు మోసం కూడా చేసాడు...!_*

*_అవన్నీధర్మం కోసమే చేసాడు, ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది...!_*

*_కలియుగం…_*

*_భగవంతుడు ఊరికేనే అవతారాలు ఎత్తాడు. తన కార్యము కోసం, ధర్మం కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. శ్రమిస్తూ.. అలసిపోయి ఇక సాధ్యం కాదు పరమాత్మ నివేదిక్కు అని వేదనతో పిలిచే ధర్మవీరుల ఆర్తిని విని..._*

*_తన భక్తుల రక్షణార్థం, దుష్ట శిక్షణ,శిష్ట రక్షణకై ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగములో.. పరమాత్మ మానవ జన్మ రూపంలో అవతారం దాల్చుచున్నాడు._*

*_పరమాత్మ రావాలంటే.. ముందు మనం ప్రయత్నం చేయాలి. దైవీకార్యం కోసం అరిగిపోవాలి. ప్రతి గుడిసె, గుడిసెకు.. ప్రతి గుండెకు దైవి విచారాలు తీసుకెళ్లాలి._*

*_మానవసేవయే మాధవుని సేవగా ప్రతి మనిషిలో పరమాత్మ తత్వాన్ని గుర్తెరిగి  అభాగ్యులకు, దీన జనాలకు, నీకు తోచిన విధంగా సహాయ, సహకారాలు అందిస్తూ సేవ చెయ్.._*

*_నిరంతరం ధర్మకార్యాలు చేస్తూ.. ధర్మం వైపు నిలబడుతు.. ప్రతి మనిషిలో దైవాన్ని తట్టి లేపుతూ.. ప్రతి మనిషి ధర్మం వైపు అడుగు వేసే విధంగా  నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి._*

*_శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుని నియమిత మాతృడిగా చేసి గీతోపదేశం చేసింది ఎక్కడో ప్రశాంతమైన వాతావరణంలో కాదు.,_*

*_అది కురుక్షేత్ర రణరంగంలో... అధర్మం పైన ధర్మం యొక్క యుద్ధాన్ని ప్రకటించారు. అధర్మం తాండవిస్తే.. తన,మన అనే భేదము లేకుండా ధర్మం కోసం యుద్ధం చేయమని సందేశాన్ని ఇచ్చాడు._*

*_ఇప్పుడు కూడా మనం ప్రతిరోజూ సమస్యలతో పోరాడుతునే వున్నాం.._*

*_ప్రతి ఒక్కరి మదిలో మంచికి-చెడుకి యుద్ధం జరుగుతునే వుంది..!_*

*_నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది..!_*

*_అదే నువ్వు నా, నీ, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది._*

*_అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది!_*

*_తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు…నీ వెనకాలా ప్రపంచమే నడుస్తుంది.._*

శ్రీ గురుభ్యో నమః
సర్వం కృష్ణార్పణమస్తు

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం