బెంగుళూరు వచ్చిననుంచీ, ఎన్నో అందమైన ఆలయాలు, అద్భుతమైన దర్శనాలు దొరుకుతున్నాయి, ఈసారి ఇంకొక అడుగు ముందుకు వేసి, 1000 కిమీ దాటి కారులో పెద్ద ప్రయాణమే చేసి వచ్చాం. క్రిస్మస్ సెలవులని బాగా ఉపయోగించుకున్నాం. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి, సకలేష్ పుర చేరుకున్నాం. సకలేశ్వర స్వామిని దర్శించుకొని, ఆ ఊళ్ళోనే రాత్రికి బస చేసాం. 2000 సంవత్సరములనాటి ఆ ఆలయానికి మళ్ళీ ఉదయాన్నే ఇంకొకసారి వెళ్లి, స్వామిని చూసుకొని కుక్షి సుబ్రహ్మణ్యం చేరుకున్నాం. ఆది సుబ్రహ్మణ్య స్వామి, కుక్షి సుబ్రహ్మణ్యస్వామి దర్శనాలు చక్కగా అయ్యాయి. అక్కడనుంచి ధర్మస్థల కి మా ప్రయాణం. మంజునాథస్వామి దర్శనానికి, పుంఖానుపుంఖాలుగా జన సందోహం వచ్చేసింది. Special దర్శనం టిక్కెట్లు కొనుక్కొని, 4 గంటలు పైగా క్యూలో వేచి, చివరకు స్వామిని చూడగలిగాం. అమ్మవారిని కూడా దర్శించుకొని, దేవస్థానంవారు పెట్టిన భోజనం చేసి, 8PM కి హొరనాడు చేరుకున్నాం. అన్నపూర్ణేశ్వరి దేవి దర్శనం చక్కగా అయింది. రాత్రి అక్కడే బస. తెల్లారి లేస్తూనే, శృంగగిరి (శృంగేరి) కి బయలు...